టీడీపీ, జనసేనకు షాకిచ్చిన ఎన్నికల కమిషన్

టీడీపీ, జనసేనకు షాకిచ్చిన ఎన్నికల కమిషన్

అమరావతి: అసెంబ్లీ ఎన్నికల వేళ టీడీపీ, జనసేన పార్టీలకు ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. ప్రధాని సభ ఫెయిల్యూర్పై టీడీపీ, జనసేన చేసిన ఫిర్యాదును ఏపీ సీఈవో ముఖేశ్కుమార్ మీనా తోసిపుచ్చారు. పరిధిలో లేని అంశంపై తమకు ఫిర్యాదు చేశారని స్పష్టం చేశారు. దీంతో ఎన్డీయే సభ ఫెయిల్యూర్ను పోలీసులపై నెట్టడంతో పాటు.. వారిని బ్లాక్మెయిల్ చేసేందుకు టీడీపీ, జనసేన పార్టీలు చేసిన కుట్ర బయటపడింది. ప్రధాని భద్రత అంశం తమ పరిధిలో లేదని ఏపీ సీఈవో ముఖేశ్కుమార్ మీనా తెలిపారు. ప్రధాని సభ భద్రత కేంద్ర హోంశాఖ, ఎస్పీజీ పరిధిలో ఉంటాయని చెప్పారు. ప్రధాని పర్యటన భద్రత అంతా కేంద్ర హోం శాఖనే చూసుకుంటుందని.. ఇందులో ఎన్నికల కమిషన్కు ఎలాంటి పాత్ర ఉండదని స్పష్టం చేశారు. దీనిపై తనకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేనని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos