న్యూ ఢిల్లీ: తెలంగాణలో వడ్లు కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని లోక్సభలో గురువారం టీఆర్ఎస్ సభ్యుడు నామ నాగేశ్వరరావు తేల్చి చెప్పారు. కేంద్రం తీరుతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆక్రోశించారు. వడ్లు కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని డిమాండు చేసారు. గురువారం లోక్సభ ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే టిఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేయడం మొదలు పెట్టారు. పోడియం వద్ద నినాదాలు రాసినఅట్టలతో నిరసన ప్రదర్శన చేసారు.