న్యూఢిల్లీ : జాతిపితను హతమార్చిన నాథూరామ్ గాడ్సే నిజమైన ఉగ్రవాది అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. మంగళ వారం ఇక్కడ ఆయన విలేఖరులతో మట్లాడారు. ‘మహాత్మా గాంధీ హంతకుణ్ని గొప్పవాడిగా ఎలా అభివర్ణిస్తారని ప్రశ్నించారు. హిందూ ఉగ్ర వాదం గురించి నోరెత్తని వారు మహాత్మా గాంధీని చంపింది ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. నాధూరామ్ గాడ్సేయే తొలి హిందు ఉగ్రవాది అని తమిళ నాడు అరవక్కురిచ్చిలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల హాసన్ వ్యాఖ్యానించారు.‘గాంధీ విగ్రహం ఎదుట నిలబడి ఒకటి చెబు తున్నా దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మొట్టమొదటి ఉగ్రవాది హిందూ వ్యక్తి నాథూరాం గాడ్సే. మహాత్మా గాంధీని హత మార్చిన గాడ్సేతోనే ఉగ్ర వాదం ఆరంభమైంది. ఇక్కడ ముస్లిం ఓటర్లు ఎక్కువ ఉన్నారని ఈ మాట చెప్పడం లేదు. ఎక్కడైనా ఇదే మాట చెబుతా’ అని చేసిన వ్యాఖ్యాలు వివాద స్పదమయ్యాయి. దరిమిలా హిందూ సంఘాలు, భాజపా నేతలు కమల్ వ్యాఖ్యలపై మండి పడు తున్నారు. కాంగ్రెస్ నేతలు కమల్కు అండగా నిలుస్తున్నారు. ఇక విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్న కమల్పై చర్యలు తీసుకోవాలంటూ పలువురు భాజపా నేతలు ఎన్నికల సంఘాన్ని కోరారు.