చర్చల కోసం విపక్షాల పట్టు

చర్చల కోసం విపక్షాల పట్టు

న్యూఢిల్లీ : సస్పెన్షన్కు గురైన 12 మంది రాజ్యసభ సభ్యులకు మద్దతుగా విపక్షాల నేతలు పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. సస్పెన్షన్ను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో టీఆర్ఎస్ సభ్యులూ పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీల నేతలు సమావేశమయ్యారు. అత్యధిక ద్రవ్యోల్బణం రేటు, వంట గ్యాస్ సిలిండర్ ధర పెరగడంపై చర్చ జరపాలని కోరుతూ కాంగ్రెస్ నేత మనీష్ తివారీ లోక్సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. కోవిడ్-19 బాధితులకు నష్ట పరిహారంపై చర్చించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు మాణిక్కం టాగూర్ కూడా నోటీసు ఇచ్చారు. కోరారు. కోవిడ్ మహమ్మారి వల్ల తీవ్రంగా నష్టపోయిన, ఆర్థిక సాయం అవసరమైనవారికి రూ.4 లక్షలు చొప్పున చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి చట్టబద్ధ హామీ ఇవ్వడంపై చర్చించాలని రాజ్యసభ సభ్యుడు దీపేందర్ సింగ్ కోరారు. ఓ సంవత్సరం నుంచి జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఈ అంశాలపై చర్చ కోసం సస్పెన్షన్ ఆఫ్ బిజినెస్ నోటీసు ఇచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos