న్యూ ఢిల్లీ: రాజధాని ఢిల్లీలో ఉల్లి ధరలు భగ్గుమన్నాయి. భారీ వర్షాల వల్ల కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉల్లి పంట దెబ్బతింది. దీంతో ఢిల్లీ చిల్లర విపణికి ఉల్లి సరఫరా పరిమాణం తగ్గిపోయింది. పది రోజుల కిందట కిలో ఉల్లి ధర రూ. 25-30 కాగా ఇప్పుడు ఏకంగా రూ.60కి పెరిగింది.