దర్శకుడు రాజమౌళి అత్యంత భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం చిత్రీకరణ చాలా వేగంగా సాగుతోంది.ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో కొమురం భిమ్ పాత్రలో ఎన్టీఆర్,అల్లూరు సీతారామరాజు పాత్రలో చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే.కాగా చిత్రంలో చరణ్కు జోడీగా నటిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ పాత్రకు సంబంధించి చిత్రీకరణ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది.కొద్ది రోజుల క్రితం చిత్రీకరణ పూర్తి కావడంతో అలియా తిరిగి ముంబయి వెళ్లిపోయినట్లు సమాచారం.ఈ సినిమాలో ఆమె తెరపై కనిపించేది 15 నిమిషాలు మాత్రమేనని చెబుతున్నారు.ఇక తారక్కు మాత్రం చిత్రంలో రొమాంటిక్ సన్నివేశాలు కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయని సమాచారం.హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఆ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని అంటున్నారు. ముందుగా ఈ సినిమాను వచ్చే ఏడాది జూలై 30న విడుదల చేయాలనుకున్నారు. కానీ అక్టోబర్ 2వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఉన్నారనేది తాజా సమాచారం. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ ఇలా మొత్త పది భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.