ఒకే ఫ్రేమ్ లో ఎన్టీఆర్,విరాట్ కొహ్లీ..

ఒకే ఫ్రేమ్ లో ఎన్టీఆర్,విరాట్ కొహ్లీ..

భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కొహ్లీ,తెలుగు సినీ హీరో తారక్‌లు కలసి ఒకే ప్రకటనలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.మద్యం సేవించి వాహనాలు నడపడం సంభవించే రోడ్డు ప్రమాదాల్లో వాహనం నడుతున్న వ్యక్తులతో పాటు ఇతర వాహనదారులు,పాదచారులు కూడా మృత్యువాత పడుతున్నారు.ఫలితంగా మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలు కూడా వీధిన పడుతున్నాయి.దీంతో మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రముఖ టీవీ ఛానెల్ NDTV ఓ అవేర్‌నెస్ ప్రోగ్రాంను నిర్వహించనుంది.అందులో విరాట్‌ కొహ్లీ,యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌లు కలసి నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.వీరితో పాటు వివిధ రంగాలకు చెందిన ఏడుగురు సెలబ్రిటీలు ప్రచారకర్తలుగా పని చేయనున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికార ప్రకటన రానుంది.విరాట్‌ కొహ్లీకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మరోవైపు ఎన్టీఆర్‌ దక్షిణాదితో పాటు కొద్ది కాలంగా ఉత్తరాదిలో కూడా గుర్తింపు లభిస్తుండడంతో ఇద్దరితో కలసి అవగాహన ప్రకటన రూపొందించడానికి ఎన్టీడీవీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos