హైదరా బాదు : నటి నిత్య మీనన్ చలన చిత్రానికి దర్శకత్వం వహించేందుకు సిద్ధమవుతున్నారు. లాక్డౌన్ కాలంలో కొన్ని స్క్రిప్టులు సిద్ధం చేసుకున్నారని సమాచారం. ప్రస్తుతం వివిధ భాషల్లో తను నటిస్తున్న చిత్రాలను వచ్చే ఏడాదిలోగా పూర్తిచేసి, 2022లో తప్పకుండా మెగా ఫోన్ పట్టుకోవాలని భావిస్తోంది. ‘అలా మెదలైంది..’ సినిమాతో తెలుగు వారికి పరిచయమైన నిత్యామీనన్ కొన్ని సినిమాల్లో పాటలూ పాడారు. ఆమెకు నటనతో బాటు దర్శకత్వం కూడా మహా ఇష్టం. అందుకే కెమెరా వెనుక నిలబడి చిత్రీకరణ తీరును ఆమె పరిశీలిస్తూ ఉంటుంది.