తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఫిరాయింపు నిషేధ చట్టం

తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఫిరాయింపు నిషేధ చట్టం

ముంబై: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం సరికొత్త మలుపు తిరుగుతోంది. ఆ రాష్ట్ర మంత్రి ఏక్ నాథ్ షిండే సీఎం ఉద్ధవ్ థాకరేపై తిరుగుబాటు చేస్తూ 20 మందికిపైగా శివసేన ఎమ్మెల్యేలతో సూరత్లో తల దాచుకోవటం తెలిసిందే. అక్కడి నుంచి తిరిగొచ్చిన ఎమ్మెల్యే నితిన్ దేశ్ ముఖ్ సంచలన ఆరోపణలు చేశారు. తనను కిడ్నాప్ చేసి బలవంతంగా గుజరాత్ కు తీసుకెళ్లారని వారి నుంచి తప్పించుకుని వచ్చానని ప్రకటించారు. ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘నన్ను ఏక్ నాథ్ షిందే తప్పుదోవ పట్టించారు. సీఎంకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న విషయం నాకు చెప్పలేదు. సూరత్ తీసుకెళ్లాక నాకు అసలు విషయం తెలిసింది. వెంటనే హోటల్ నుంచి బయటికి వస్తుంటే.. పోలీసులు అడ్డుకున్నారు. నాకేమీ అనారోగ్యం లేకున్నా.. గుండెపోటు వచ్చిందంటూ బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. ఏదో ఇంజెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నించారు. నన్ను హత్య చేయడానికి ప్రయత్నించారు. వారి నుంచి ఎలాగోలా తప్పించుకుని ముంబైకి వచ్చాను. నేను ఎప్పటికీ శివసేన సైనికుడినే. ఉద్ధవ్ కే నా మద్దతు” అని ప్రకటించారు.  బుధవారం సాయంత్రం 5 గంటలకు శివసేన ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. ఆ సమావేశానికి రాకపోతే పార్టీని వీడుతున్నట్టుగా పరిగణించి.. సభ్యత్వం రద్దు చేస్తామని హెచ్చరించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos