వివాదాలకు దూరంగా ఉండే మిస్టర్ కూల్ సతీమణి సాక్షి సింగ్
తాజాగా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన ఫోటోతో వివాదంలో ఇరుక్కున్నారు.ఐపీఎస్ టోర్నీ
జరుగుతున్న నేపథ్యంలో ధోనీతోనే ఉంటున్న సాక్షి సింగ్ ధోనీ నాయకత్వం వహిస్తున్న చెన్నై
సూపర్ కింగ్స్ జట్టులోని మోను కుమార్తో కలసి దిగిన ఓ ఫోటోను ఇన్స్టాగ్రామ్లో షేర్
చేశారు.అందులో మోను కుమార్ బట్టతలను ముద్దు పెట్టుకుంటున్న ఫోటోను షేర్ చేయడంతో పాటు
బంజరు భూమి.. పచ్చదనం కోసం ఎదురుచూస్తోంది. గడ్డి ఈ సైడ్ పచ్చగా లేదనుకుంటాంటూ రాసిన వ్యాఖ్యపైనా పలువురు మండిపడుతున్నారు.సాక్షి నుంచి ఇలాంటిది తాను ఊహించలేదని.. మీరు ఇలాంటి పోస్ట్ పెట్టటం తమను బాధించినట్లు కొందరు పేర్కొన్నారు.మరికొందరు ఆమెను ఆన్ ఫాలో చేస్తున్నట్లుగా మెసేజ్ పెట్టారు. గతంలో సాక్షి సింగ్ ను ప్రపంచంలోనే ఉత్తమ వదిన అంటూ మోను కుమార్ పొగడటం తెలిసిందే.సరదాగా పెట్టిన పోస్ట్.. ఇప్పుడు రివర్స్ కావటమే కాదు.. పలువురు నెటిజన్లు ఆగ్రహం చెందేలా మారింది. నెగిటివ్ కామెంట్స్ దారిన అవి వస్తుంటే.. మరికొందరు ఈ ఫోటోకు పాజిటివ్ గానూ స్పందించటం గమనార్హం. ఫ్లాట్ పిచ్ బాగుంది.. బ్యాటింగ్ కు పనికొస్తుందంటూ బట్టతలపై సె్టైర్లు వేస్తున్నారు..