న్యూఢిల్లీ : భారత్-నేపాల్ మధ్య తల్తెతిన అన్ని అంశాలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని క్షణ రాజనాథ్ సింగ్ తెలిపారు. నేపాల్తో సామాజిక, చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంబంధాలు ఉన్నాయన్నారు. ఉత్తరా ఖండ్ జన్ సంవాద్ ర్యాలీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. కైలాష్ మానస సరోవర్ యాత్ర కోసం సరిహద్దు రహదార్ల సంస్థ లిపులేక్ వరకూ లంకె మార్గాన్ని నిర్మించడం వల్ల విభేదాలు తలెత్తాయన్నారు. గతంలో నాథులా కనమ ద్వారా యాత్రికులు మానస సరోవర్కు వెళ్లేవారు. అక్కడి కోసం భారత భూ భాగంలో 80 కిమీ పొడవైన రోడ్డు నిర్మించాం. దీనిపై నేపాల్కు అవగాహన కొరవడిందన్నారు. కాలాపాని, లిపూలేక్, లింపియదుర వంటి భారత భూభాగాలను తమ మ్యాప్లో చూపుతూ రాజ్యాంగ సవరణ బిల్లుకు నేపాల్ పార్లమెంట్ దిగువసభ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.