అమరావతి: రాజ్యసభ ఎన్నికల సందర్భంగా శుక్రవారం ఇక్కడ ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది. ఓటు వేయడానికి మొదట బాలకృష్ణ వచ్చారు. పోలింగ్ కేంద్రానికి ఆయన నడుచుకుంటూ వెళ్తున్నపుడు అక్కడున్న ఒక కుక్క మొరిగింది. ‘ఎవరికి అర్థమయ్యే భాషలో వారికి చెప్పాలి. మేము అరిచేవాళ్లం కాదు… కరిచేవాళ్లమ’ని ప్రత్యర్థులను దృష్టిలో పెట్టుకుని వ్యంగ్య్యోక్తి విసిరారు.