చిక్కుల్లో నయనతార… నేరం రుజువైతే ఐదేళ్ల జైలు శిక్ష

చిక్కుల్లో నయనతార… నేరం రుజువైతే ఐదేళ్ల జైలు శిక్ష

చెన్నై: నటి నయనతార, సినీ దర్శకుడు విఘ్నేశ్ శివన్ దంపతులు వివాదంలో చిక్కుకున్నారు. పెళ్లయిన నాలుగు నెలలకే అద్దె గర్భం ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. 2019లో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం ఈ పద్ధతి ద్వారా పిల్లలను కనడం నేరం. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ సరోగసీ ద్వారా పిల్లలను కన్నట్టయితే నయనతార, విఘ్నేష్ లకు ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఒకవేళ సరోగసీ ద్వారా కాదు… పిల్లలను దత్తత చేసుకున్నామని చెప్పినా సమస్యలు తప్పవు. పిల్లలను దత్తత తీసుకోవాలంటే లీగల్ గా ప్రొసీడ్ కావాల్సి ఉంటుంది. చట్ట పరంగా దత్తత తీసుకుంటే పర్వాలేదు… లేని పక్షంలో చట్టాన్ని ఉల్లంఘించినట్టే అవుతుంది. దీనిపై వివరణ ఇవ్వాలని వారికి తమిళనాడు ప్రభుత్వం నోటీసులు పంపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos