ముంగిటకే మద్యం

ముంగిటకే మద్యం

బెంగళూరు: ప్రజల సౌకర్యం కోసం మద్యాన్ని ఇళ్లకు సరఫరా చేస్తామని అబ్కారి మంత్రి నగేశ్ గురువారం ఇక్కడ ప్రకటించారు. మంత్రిగా బాధ్యతల్ని స్వీకరించిన తర్వాత తొలి సారిగా ఇక్కడ నిర్వహించిన విలేఖరుల సమావేశంలోఈ ప్రకటన చేసారు. దీనిపై ముఖ్యమంత్రి యడియూరప్ప మండి పడ్డారు. ‘అంతా మీ ఇష్టమేనా..? ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారు..? అసలు ఈ విషయాలన్నీ విలేఖరులకు ఎందుకు చెప్పార’ని నగేష్ను మందలించారు. మంత్రి ప్రకటన కన్నడ రాజకీయాల్లో కలకలాన్ని రేపింది. విపక్షాలు ఎలా స్పందిస్తాయో నిరీక్షించాల్సి ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos