విశాఖ: ‘విశాఖ ఉక్కు కర్మాగారం విక్రయాన్ని అడ్డుకుంటాం. అవసరమైతే పదవికి కూడా రాజీనామా చేస్తాన’ని లోక్సభ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ ప్రకటించారు. శుక్రవారం ఇక్కడ అఖిలపక్ష కార్మికసంఘాల ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ‘విశాఖ స్టీల్ప్లాంట్ నష్టాల్లో లేదు. ప్రయివేటీకరణ అక్కరలేదు. ఉక్కు శాఖ కేంద్ర మంత్రి కీ లేఖ రాశా. దీనిపై పార్లమెంటులోనూ పోరాడతా మ’ని భరోసా ఇచ్చారు. అనకాపల్లి ఎంపి సత్యవతి మాట్లా డుతూ రాష్ట్రప్రభుత్వం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధమన్నారు. పార్టీల కతీతంగా అందరూ ఈ ఉద్యమంలోకి రావాలని పిలుపు నిచ్చారు.