నెల్లూరు జిల్లాలో తెదేపా నేతపై జరిగిన హత్యాయత్నం ఘటన చర్చనీయాంశమైంది.జిల్లాలోని మూలపేట గ్రామానికి చెందిన తెదేపా నేత సుధాకర్పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి పారిపోయారు. దాడిలో సుధాకర్కు తీవ్రగాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.అయితే ఈ దాడికి పాల్పడింది వైసీపీ నేతలనంటూ సుధాకర్ వర్గీయులు ఆరోపించ దాడికి తమకు సంబంధం లేదంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు.సుధాకర్పై దాడితో మూలపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులను మొహరించారు.సుధాకర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజకీయ కక్షల నేపథ్యంలోనే దాడి జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు..