వైసీపీలో చేరిన ముద్రగడ

వైసీపీలో చేరిన ముద్రగడ

అమరావతి: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సస్పెన్స్కు తెరదించారు. కొద్దిసేపటి క్రితం వైసీపీలో చేరారు. ఈ ఉదయం తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన తనయుడు గిరి కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు.
ముద్రగడ రాజకీయ పార్టీలో చేరబోతున్నట్టు ఇటీవల ప్రచారం జరగడంతో ఆయన ఏ పార్టీలోకి వెళ్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. జనసేన నేతలుఆయన ఇంటికి వెళ్లి చర్చలు కూడా జరపడంతో ఆ పార్టీలో చేరడం ఖాయమని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా వైసీపీలో చేరబోతున్నట్టు ముద్రగడ ఇటీవల ప్రకటించారు. మొన్ననే ఆయన పార్టీలో చేరాల్సి ఉండగా అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. ఎట్టకేలకు నేడు వైసీపీ కండువా కప్పుకుని ఆ పార్టీ నేతగా మారారు.
ముద్రగడ 1978లో జనతా పార్టీలో చేరి రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఎన్టీఆర్ టీడీపీ స్థాపించాక అందులో చేరారు. ఉమ్మడి ఏపీలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొందారు. 1999 ఎన్నికల్లో కాకినాడ లోక్సభ స్థానం నుంచి ఎన్నికయ్యారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల్లో మంత్రిగానూ పనిచేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos