భారత క్రికెట్ జట్టు మాజీ సారథి ఎంఎస్ ధోనీ సైనికుల జీవితాలు,విధులు,స్థితిగతులు,సమస్యల గురింయి ఓ టీవీ షో నిర్మించడానికి సిద్ధమవుతున్నాడు.భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోనీకి సైనికులంటే అపారమైన గౌరవం.ఈ షో ద్వారా సైనికుల త్యాగాలు, దేశ భద్రత కోసం వారి శ్రమ ప్రజలందరికీ తెలియాలన్నదే ధోనీ ఉద్దేశం. సైనికులు, వారి కుటుంబ సభ్యుల వాస్తవిక జీవితాలు ఎలా ఉంటాయన్నది కూడా ధోనీ తన టీవీ షో ద్వారా వివరించనున్నాడు. ఓ జాతీయ స్థాయి చానల్ (స్టార్ ప్లస్ లేదా సోనీ టీవీ) లో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.ప్రపంచ కప్ ముగియగానే జమ్మూకశ్మీర్ వంటి సంక్లిష్ట ప్రాంతంలో రెండు నెలల పాటు సైనిక విధులు నిర్వర్తించిన విషయం తెలిసిందే.