హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, విద్యానికేతన్ విద్యా సంస్థల అధిపతి మంచు మోహన్ బాబు మంగళవారం వైకాపాలో చేరారు. మోహన్ బాబు కు జగన్ వైకాపా కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అంతకు ముందు మోహన్ బాబు, ఆయన పెద్ద కొడుకు, నటుడు మంచు విష్ణు వైకాపా అధినేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డితో అర్ధ గంట పాటు మంతనాలు జరిపారు.మోహన్ బాబును రాజ్యసభ సభ్యుడుగా ఎంపిక చేయాలని వైకాపా నాయకత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.