మోదీ టర్కీ పర్యటన రద్దు..

ప్రధాని నరేంద్రమోదీ టర్కీ దేశ పర్యటనను రద్దు చేసుకున్నారు.ఈ మేరకు భారత విదేశీ మంత్రిత్వ శాఖ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి ఐరాస సమావేశంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ భారత్ తీసుకున్నవి దూకుడు నిర్ణయాలని పాక్‌కు మద్దతుగా టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్డోగాన్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మోదీ ఆ దేశ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఐరాసలో టర్కీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను భారత్ ఇప్పటికే ఖండించింది. అంతేకాకుండా టర్కీతో 2.3 బిలియన్ డాలర్ల షిప్ యార్డ్ టెండర్ ను కూడా భారత్ రద్దు చేసుకునే యోచనలో ఉందని తెలుస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos