4 గంటల పర్యటన ఖర్చు రూ.23 కోట్లు

భోపాల్ : గిరిజన యోధుల సంస్మరణార్థం మధ్యప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ 15న నిర్వహించనున్న జన జాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరువుతున్నారు. రాష్ట్ర రాజధానిలో సుమారు 4 గంటల పాటు ఉండనున్నారు. ఇందు కోసం మధ్య ప్రదేశ్ ప్రభుత్వం రూ. 23 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నది. దీనిలో సుమారు రూ.15 కోట్లు రవాణా వ్యయం. జంబోరి మైదాన్లో జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలు దిక్కుల నుంచి సుమారు 2 లక్షల మంది గిరిజనులు హాజరు కానున్నట్లు సమాచారం. 52 జిల్లాల నుంచి వచ్చే ప్రజల రవాణా, ఆహారం, వసతి కోసం ప్రభుత్వం రూ.12 కోట్లు కేటాయించింది. అతిథులు కూర్చునే వేదిక కోసం ప్రత్యే కంగా ఐదు గోపురాలు, గుడారాల నిర్మాణం, ఇతర అలంకరణ, ప్రచారానికి గాను 9 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టినట్లు సమాచారం. షెడ్యూల్డ్ తెగలకు 47 సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి. 2008లో బీజేపీ వీటిలో 29 గెలిచింది. 2013లో ఆ సంఖ్య 31 పెరిగింది. అయితే 2018లో 47 స్థానాల్లో బీజేపీకి 16 సీట్లు మాత్రమే వచ్చాయి. వీట న్నింటిని దృష్టిలో పెట్టుకుని శివరాజ్సింగ్ చౌహాన్ భారీ ఎత్తున గిరిజనుల యోధుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos