స్మార్ట్మొబైళ్లు,సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాక సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల హడావిడి ఎక్కువైంది.అభిమానం ప్రదర్శించడానికి,తిట్టుకోవడానికి చివరకు కక్ష సాధింపులకు కూడా సామాజిక మాధ్యమాలనే వేదికలుగా ఎంచుకుంటున్నారు .సినిమా, క్రికెట్, రాజకీయ రంగాలతో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు ఏదైనా కొంచెం అటుఇటుగా స్పందిస్తే ఇక అంతే సంగతులు.నెటిజన్ల కమెంట్లతో సామాజిక మాధ్యమాలు హోరెత్తిపోతాయి.ఇలా చాలా మంది సెలబ్రిటీలు నెటిజన్ల ట్రోల్స్ బారినపడ్డవారే.తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి కూడా సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల బాధితుడయ్యారు.కొద్ది కాలంగా మల్లారెడ్డిపై కొంతమంది అసభ్య పదజాలాలతో దూషిస్తూ కమెంట్లు పోస్ట్ చేస్తుండడంతో నెటిజన్ల బారి నుంచి రక్షించాలంటూ మల్లారెడ్డి సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐపీ అడ్రస్ల ద్వారా నిందితుల ఆచూకీ కనుగొన్నారని మరికొద్ది రోజుల్లో నిందితులను అరెస్ట్ చేయనున్నట్లు ఓఎస్డీ శ్రీనివాసరెడ్డి తెలిపారు..