‘ఏమైనా చేసుకోండి భయపడను’

‘ఏమైనా చేసుకోండి భయపడను’

న్యూ ఢిల్లీ : సాగు చట్టాల రద్దును కోసం ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు పలికిన అమెరికా ఉపాధ్యక్షులు కమలా హ్యారిస్ మేనకోడలు మీనా హ్యారిస్ దిష్టి బొమ్మలను, పోస్టర్లను యునైటెడ్ హిందూ ఫ్రంట్ కార్యకర్తలు శుక్రవారం ఇక్కడ దగ్దం చేసారు. దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీయులు జోక్యాన్ని సహించబోమని పోస్టర్లను ప్రదర్శించారు. దీనిపై మీనా హ్యారిస్ కూడా ఘాటుగా స్పందించారు. ‘నేను ఇండియాలోని రైతుల మానవ హక్కులను కాపాడటం కోసం మాట్లాడాను. ఎంత స్పందన వచ్చిందో చూడండి. నేనిలానే మాట్లాడతాను. ప్రపంచంలోని అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశంలో నెల రోజుల కిందట ఏం జరిగిందో చూశాం. దానిపై మాట్లాడుకున్నాం. ఇప్పుడు అత్యధిక జనాభా ఉన్న దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ఇండియాలో ఇంటర్నెట్ ను ఆపేస్తున్నారు. పారా మిలిటరీ దళాలు రైతులపై దాడులు చేస్తున్నాయి” అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos