భోపాల్ : రైళ్లలో దేహ మర్ధన సేవల్ని ప్రారంభిస్తామని రైల్వే శాఖ చేసిన ప్రకటన చౌకబారు నిర్ణయమని భాజపా లోక్సభ సభ్యుడు శంకర్ లాల్వానీ మండి పడ్డారు. మహిళా ప్రయాణీకుల సమక్షంలో రైళ్లలో దేహ మర్ధనల్ని చేయటం మంచిది కాదని, భారత సంస్కృతికి విరుద్ధమని రైల్వే మంత్రి పీయూష్ గోయల్కు రాసిన లేఖలో ఆక్షేపించారు. వైద్య సేవలు కల్పించటానికి బదులుగా మర్ధన సేవల్ని చేపట్టటం బాధ్యతా రాహిత్య చర్యని దుయ్యబట్టారు.