ప్రజావాహిని- బెంగళూరు
మస్కి పట్టణంలో మినీ విధానసౌధ కట్టే అంశాన్ని పరిశీలిస్తామని రెవిన్యూ మంత్రి అశోక్ సోమవారం విధానసభలో తెలిపారు. ప్రశ్నోత్తర వేళలో సభ్యుడు బసవనగౌడ తుర్వి హాళ్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు బదులిచ్చారు. అక్కడ వివిధ శాఖల తాలూకా కార్యాలయాల్ని వెంటనే ఏర్పాటు చేయాలని అన్ని శాఖలకూ లేఖ రాయనున్నట్లు చెప్పారు. ఐదేళ్ల కిందట మస్కిని తాలూకా కేంద్రంగా ప్రకటించినప్పటికీ కేవలం రెండు మూడు కార్యాలయాలే ఉన్నందున ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సోదాహరణంగా విపులీకరించారు. తాలూకా పంచాయతి, తాసీల్దార్ కచ్చేరి తప్ప మిగిలినవి ఏవీ లేవని విమర్శించారు.