ఇంట్లో కూడా మాస్క్‌ పెట్టుకోవాల్సిందే…

ఇంట్లో కూడా మాస్క్‌ పెట్టుకోవాల్సిందే…

న్యూఢిల్లీ: బయటికి వెళ్లినప్పుడే కాదు, ఇంట్లో ఉన్నా కూడా మాస్క్ ధరించాలట. కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో ఉన్న నేపధ్యంలో నీతి అయోగ్ ఆరోగ్య విభాగం ఈ సూచన చేసింది. సోమవారం ఢిల్లీలో కోవిడ్ తీవ్రతపై ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ వీకే పాల్ మాట్లాడుతూ ‘‘కోవిడ్ తీవ్రంగా ఉన్న కారణంగా అత్యవసరమైతే కానీ బయటికి వెళ్లొద్దు. కుటుంబ సభ్యులతో ఉన్నా సరే మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. అలాగే ఈ సమయంలో ఇతరులను ఇంటికి పిలవకపోవడమే మంచిది’’ అని పేర్కొన్నారు. మొదటి దశతో పోల్చుకుంటే రెండవ దశలో కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం దేశంలో రోజుకు సగటున 3 లక్షలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఢిల్లీ, ముంబై వంటి నగరాల పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఓ వైపు దేశంలో విస్తృతంగా టీకా కార్యక్రమం కొనసాగుతోంది. మరోవైపు కరోనా కూడా అదే స్థాయిలో విజృంభిస్తోంది. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos