ముంబై: స్టాక్ మార్కెట్ లు మంగళ వారం లాభాలతో వ్యాపారాల్ని ఆరంభించాయి. సెన్సెక్స్ 130 పాయింట్లు పెరిగి 35041 వద్ద, నిఫ్టీ 43 పాయింట్ల లాభంతో 10354 వద్ద వ్యాపారాల్ని మొదలు పెట్టాయి. బజాజ్ ఫిన్ సర్వీసెస్, జేఎస్డబ్ల్యూస్టీల్, యూపీఎల్, బజాజ్ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు 2-4 శాతం లాభపడ్డాయి. హెచ్సీఎల్టెక్, సన్ఫార్మా, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ షేర్లు 0.10-0.50 శాతం నష్ట పోయాయి.