అక్కడ 52 ఏళ్లు ఎగరని జాతీయ జెండా

అక్కడ 52 ఏళ్లు ఎగరని జాతీయ జెండా

రాయ్పూర్: ఛత్తీస్గఢ్ పీసీసీ అధ్యక్షుడు మోహన్ మార్కం ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్కు జాతీయ జెండాను కొరియర్ లో పంపారు. ఖాదీతో తయారు చేసిన ఆ త్రివర్ణ పతాకాన్ని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఎగుర వేయాలని కోరారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఆగస్టు 2 నుంచి 15 వరకు ప్రతి ఒక్కరు జాతీయ జెండాను తమ డీపీలుగా పెట్టుకోవాలని , ఆగస్టు 15న ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాలని ప్రధాని మోదీ కోరారు. కానీ ఆర్ఎస్ఎస్, దాని చీఫ్ మోహన్ భగవత్ మాత్రం డీపీని మార్చలేదు. దీంతో ఆర్ఎస్ఎస్ చీఫ్ను సంస్థ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసేలా విజ్ఞప్తి చేయాలని ప్రధాని మోదీని మోహన్ మార్కం కోరారు. గత 52 ఏళ్లుగా ఆ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేయలేదని పేర్కొన్నారు. అందుకే ఈసారైనా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించాలన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos