ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి

హైదరాబాద్ : ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో బుధవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. బాసగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని చీపురుబట్టి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతాబలగాలకు, మావోయిస్టులు తారసపడ్డారు. దాంతో భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. అవతలివైపు నుంచి కాల్పులు ఆగిపోయిన అనంతరం భద్రతాబలగాలు వెళ్లి పరిశీలించగా.. ఘటన స్థలంలో ఆరుగురి మృతదేహాలు కనిపించాయి. మావోయిస్టులకు సంబంధించిన మారణాయుధాలు, పేలుడు పదార్థాలు కూడా దొరికాయి. వాటిని సీజ్ చేసిన పోలీసులు, మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos