సాగు చట్టాల రద్దుకు లోక్​సభలో కాంగ్రెస్ ముసాయిదా

సాగు చట్టాల రద్దుకు లోక్​సభలో కాంగ్రెస్ ముసాయిదా

న్యూ ఢిల్లీ: కొత్త సాగు చట్టాల్ని రద్దు చేయాలని కోరుతూ పంజాబ్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు లోక్సభలో ప్రైవేటు ముసాయిదా – రిపీలింగ్ అండ్ అమెండ్మెంట్ బిల్ 2021ను ప్రవేశపెట్టనున్నట్లు ఆ పార్టీ సభ్యుడు మనీష్ తివారీ తెలిపారు. ప్రణీత్ కౌర్, జస్బీర్ సింగ్ గిల్, సంతోఖ్ చౌదరి సహా పలువురు పార్టీ ఎంపీలతో కలసి కలిసి దీన్ని ప్రతిపాదించనున్నట్లు వెల్లడించారు. రైతుల పట్ల సానుభూతితో ఉన్న ఇతర పార్టీల ఎంపీలను ఈ బిల్లుకు మద్దతివ్వాలని కోరనున్నట్లు తెలిపారు తివారీ. రాజ్యసభలోనూ ఇలాంటి బిల్లును ప్రవేశపెట్టాలని తమ పార్టీకి చెందిన సభ్యులను అభ్యర్థిస్తామని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos