ఒలింపిక్స్ రికార్డు సృష్టించిన వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి జీవిత చరిత్రను తెరకెక్కించనున్నట్టు నిర్మాత కోన వెంకట్ ట్విట్టర్ లో వెల్లడించారు. 2000 ఒలింపిక్స్ లో మల్లీశ్వరి భారత ఖ్యాతిని దిగంతాలకు వ్యాపింప జేసిన సంగతి తెలిసిందే. నేడు కరణం మల్లీశ్వరి పుట్టిన రోజు. మరో నిర్మాత ఎంవీవీ సత్యనారాయణతో కలిసి ఎంవీవీ సినిమా, కేఎఫ్సీ (కోనా ఫిల్మ్ కార్పొరేషన్) ఈ సినిమాను నిర్మించనున్నట్టు కోన వెంకట్ తెలిపారు. కరణం మల్లీశ్వరి పాత్రను చేసే హీరోయిన్ ఎవరన్న విషయమై స్పష్టత ఇవ్వలేదు. ఈ సినిమాకు సంజనా రెడ్డి దర్శకత్వం వహించనున్నారు.