వికటించిన పోలీసు ప్రేమ

వికటించిన పోలీసు ప్రేమ

హొసూరు : ఇద్దరు పోలీసుల నడుమ మూడేళ్లుగా సాగిన ప్రేమ వికటించడంతో ప్రియురాలు ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. కృష్ణగిరి జిల్లా అంచెట్టి సమీపంలోని పాండురంగన్ దొడ్డి గ్రామానికి చెందిన నదియా,కన్నన్‌లు పోలీసు కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. నదియా తిరుపూర్‌లో విధులు నిర్వహిస్తుండగా కన్నన్ కృష్ణగిరిలో పని చేస్తున్నాడు. గత మూడేళ్లుగా కలిసి తిరిగిన ఇద్దరి మధ్య పెళ్లి విషయమై మనస్పర్థలు ఏర్పడ్డాయి. మూడు రోజుల కిందట సెలవుపై ఇంటికి వచ్చిన నదియా కృష్ణగిరిలో విధులు నిర్వహిస్తున్న కన్నన్ వద్దకు వెళ్ళి పెళ్లి చేసుకోవాలంటూ డిమాండ్ చేసింది. అతను నిరాకరించడంతో గొడవపడి ఇంటికి చేరుకుంది సోమవారం ఉదయం పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన బంధువులు ఆమెను డెంకణీకోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై అంచెట్టి పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో కన్నన్, నదియాల ప్రేమ విషయం బయటపడింది. పెళ్లి ప్రస్తావన రావడంతో కన్నన్ దూరం పెట్టడంతో మనస్తాపం చెందిన నదియా ఆత్మహత్యకు ప్రయత్నించిందని తేలింది. కేసు దర్యాప్తులో ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos