ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ఆరంభమయ్యాయి. కోలుకునే సూచనలు కరువు. ఉదయం మందకొడిగా మొదలైన మార్కెట్లు 9.47 గంటల వేళకు నష్టాల్లోకి దిగజారాయి. సెన్సెక్స్ 81పాయింట్లు నష్టపోయి 40,034 వద్ద, నిఫ్టీ 35 పాయింట్లు నష్టపోయి 11,804 వద్ద నిలిచాయి. ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, టైటాన్ కంపెనీ, ఐషర్ మోటార్స్, మారుతీ సుజుకీ షేర్లు లాభాలు, భారతీ ఇన్ఫ్రా టెల్, భారతీ ఎయిర్టెల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, హిందాల్కో షేర్లు నష్టాల్ని చవి చూసాయి.