ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, వడ్డీ రేట్ల పెంపు, ద్రవ్యోల్బణం, కీలక సంస్థల ఫలితాలపై దృష్టి పెట్టిన మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. సోమవారం ఉదయం పది గంటల ప్రాంతంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 600 పాయింట్ల నష్టంతో 54,233 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 178 పాయింట్లు కోల్పోయి 16,233 వద్ద కొనసాగుతోంది.