నష్టాల పాలైన స్టాక్‌ మార్కెట్‌

నష్టాల పాలైన స్టాక్‌ మార్కెట్‌

ముంబై: స్టాక్ మార్కెట్లు ఈ వారం నష్టాల పాలయ్యాయి. శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే హెల్త్ కేర్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఆ తర్వాత అది బ్యాంకింగ్, ఫైనాన్స్, టెలికాం, ఆటో రంగాలకు విస్తరించింది. సెన్సెక్స్ 289 పాయింట్లు నష్టపోయి 39,452కి పడిపోయింది. నిఫ్టీ 90 పాయింట్లు కోల్పోయి 11,823కు దిగజారింది. బీఎస్ఈ సెన్సెక్స్ లో ఎల్ అండ్ టీ (0.80%), వేదాంత లిమిటెడ్ (0.74%), సన్ ఫార్మా (0.58%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (0.44%), టీసీఎస్ (0.09%) లబ్ధి పొందాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ (-4.36%), భారతి ఎయిర్ టెల్ (-2.74%), యాక్సిస్ బ్యాంక్ (-2.39%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (-2.10%), టాటా మోటార్స్ (-1.97%).నష్టపోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos