అమరావతి: వైసీపీ అధినేత జగన్, సాక్షి పత్రిక, టెలివిజన్లను మంత్రి నారా లోకేష్ గురువారం ట్వీట్లో ఈసడించారు. ‘సాక్షి రాతలకు ఉండదు మనస్సాక్షి. అది దొంగబ్బాయి పెంచుకున్న మాయ పక్షి. దేన్నయినా మసి పూసి మారేడు కాయ చేస్తుంది. జరిగింది జరగనట్టు, జరగనిది జరిగినట్టు చెబుతుంది’ అని ట్వీట్ చేశారు. ‘లక్షల కోట్ల అక్రమార్జన కోసం క్విడ్ ప్రో కోను కనిపెట్టిన జగన్ గారు ఇప్పుడు ఆ కేసుల నుంచి బయటపడటానికి ప్రధాని మోదీతో రాజకీయ క్విడ్ ప్రోకోకు దిగారు. టైమ్స్ నౌ కలువకుంట కుట్ర లిప్పేసింది’ అని మరో ట్వీట్ చేశారు.