పాట్నా:బీహార్లో ఎక్కడయినా అక్రమ మద్యం దొరికితే సంబంధిత పోలీసు ఠాణా సబ్ ఇన్స్పెక్టరుపై క్రమ శిక్షణ చర్యల్ని తీసుకుంటామని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురువారం హెచ్చరించారు. అక్రమ మద్యం ఏ ప్రాంతంలో దొరికితే ఆ ప్రాంత ఎస్ఐలకు వచ్చే పదేళ్ల పాటు పోలీసు స్టేషన్లలో విధుల్ని నిర్వర్తించే బ్యాధతను అప్పగించబోమని తేల్చి చెప్పారు. బీహార్ లో సంపూర్ణ మద్య నిషేధాన్ని సమర్ధంగా అమ లయ్యేలా పని చేయాలని పోలీసుల్ని ఆదేశించారు.