ఇల్లు కూల్చివేతపై రమేశ్‌ వ్యాజ్యం

ఇల్లు కూల్చివేతపై  రమేశ్‌ వ్యాజ్యం

అమరావతి: తనకు సమాచారం ఇవ్వకుండా తన ఇంటిని కూల్చివేస్తున్నారని వ్యాపారి లింగమనేని రమేష్ బుధవారం ఇక్కడి ఉన్నత న్యాయ స్థానం లో వ్యాజ్యాన్ని దాఖలు చేసారు. కూల్చివేయకుండా నిలుపుదల ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీని పై ప్రస్తుతం వాదనలు జరుగు తున్నాయి. తన నివాసాన్ని కూల్చి వేయరాదని రమేశ్ మంగళవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఐదు పుటల లేఖ రాశారు. కట్టడాల కూల్చివేత లక్షల మందిని నిరాశ నిస్పృహల్లోకి నెట్టివేస్తుందని పేర్కొన్నారు. కరకట్టపై మొదలైన ఈ ప్రక్రియ తమ ప్రాంతాలకు విస్తరిస్తుందనే ఆందోళన రాష్ట్ర మంతా మొదలైంద పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos