నంద్యాల: ఇక్కడి ఎస్పీవై ఆగ్రో కంపెనీలో విష వాయువు లీక్ కావడంతో దాన్ని పీల్చిన వారిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. అస్వస్థతకు గురయిన ముగ్గుర్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రాణ భయంతో కర్మాగారం నుంచి కార్మికులు బయటకు పరుగులు తీశారు. అగ్ని మాపక, రెవెన్యూ సిబ్బంది పరిస్థితులను పరిశీలిస్తున్నారు. గ్యాస్ లీకేజి అదుపునకు సిబ్బంది ప్రయత్నాలు చేస్తోంది.