తిరుమల:తిరుపతి- తిరుమల మొదటి కనుమ దారిలో 52వ మలుపు వద్ద బుధవారం ఉదయం చిరుత పులి సంచరించింది. దీంతో నడక దారి భక్తులు, వాహన దారులు భయాందోళనలకు గురయ్యారు. తితిదే సిబ్బంది సైరన్ మోగించడంతో చిరుత అడవిలోకి పారిపోయింది. నడక దారిలో భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లాలని అధికారుల సూచించారు. అటవీ సిబ్బంది అప్రమత్తమయ్యారు.