శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని నిషేధించటం అభినంద నీయమని జనసేన పార్టీ నేత, సీబీఐ మాజీ సంయుక్త సంచాలకులు లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. మద్యం వల్ల అనేక కుటుంబాలు నాశనమైపోతున్నాయని చెప్పారు. మద్య నిషేధం ప్రజా జీవితాల్ని కచ్చితంగా ప్రభావితం చేస్తాయన్నారు. దశలవారీ మద్య నిషేధంతో ప్రజల్లో మార్పు తెస్తుందని ఆశించారు.