పాట్నా: బీహార్ విధాన సభ ఎన్నికల ముంగిట లాలూ ప్రసాద్ యాదవ్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్రీయ జనతాదళ్ పార్టీకి చెందిన ఐదుగురు విధానపరిషత్తు సభ్యులు పార్టీకి రాజీనామా చేసి జనతదాళ్ యునైటెడ్లో చేరారు. రాజీనామా చేసిన వారు: సంజయ్ ప్రసాద్, కమరె ఆలమ్, రాధాచరణ్ సేఠ్, రణ్ విజయ్ సింగ్, దిలీప్ రాయ్. వారంతా ఒకప్పుడు లాలూకు అత్యంత సన్నిహితులు.జులై ఏడున ఏడు విధానపరిషత్తు స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో లాలూ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ను పోటీ చేయనున్నారు.రఘువంశ్ ప్రసాద్ సింగ్ కూడా ఆర్జేడీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయనా జేడియూలో చేరతారని ప్రచారం జరుగుతోంది.