యశ్వంత్​ సిన్హాకే మా మద్దతు

న్యూ ఢిల్లీ : విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్ ఎస్ మద్దతు వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ వెల్లడించారు. యశ్వంత్ సిన్హాకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కేటీఆర్ విలేఖరులతో మాట్లాడారు. యశ్వంత్ సిన్హాను హైదరాబాద్కు ఆహ్వానించామని చెప్పారు.‘ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ, నిరంకుశ విధానాలతో పాలన సాగిస్తోంది. మోడీ ప్రభుత్వం వచ్చాక ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. ప్పటివరకు ఎనిమిది రాష్ట్రాల్లో బీజేపీకి మెజారిటీ లేకపోయినా తప్పుడు మార్గా ల్లో అధికారం పొంది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. రాజ్యాంగ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని.. రాజకీయ ప్రయోజనాల కోసం విపక్షాలను ఇబ్బంది పెడు తోంది. ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ బీజేపీ తీరును వ్యతిరేకించాలి. ఈ కారణంగానే బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిని తిరస్కరించి, విపక్షాల అభ్యర్థిని బలపరిచాం. ఎన్డీయే రాష్ట్ర పతి అభ్యర్థి ద్రౌపది ముర్ము పట్ల వ్యక్తి గతంగా ఎలాంటి వ్యతిరేకత లేదు. రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళను నిలిపామని బీజేపీ చెప్తోంది. వారిపై అంత ప్రేమ ఉంటే గిరిజన రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలి. గిరిజన రిజర్వేషన్లు పెంచాలని తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి నాలుగేళ్లు అయినా నిని ఆమోదించలేదు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని పునర్విభజన చట్టంలో పెట్టారు. ఇప్పటికీ దానికి అతీగతీ లేద’ని మండి పడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos