CloseX ‘ఖడ్గం’ సినిమాను ఇప్పుడు తీయలేం

CloseX ‘ఖడ్గం’ సినిమాను ఇప్పుడు తీయలేం

హైదరాబాదు: కృష్ణవంశీ తెరకెక్కించిన సినిమాలు వినోదంతో పాటు సామాజిక సందేశాన్ని కూడా ఇస్తుంటాయి. వాటిలో ‘ఖడ్గం’ ఒకటి. విడుదలై ఇరవయ్యే ళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక మాధ్యమ సంస్థ ముఖాముఖిలో పాల్గొన్నారు. .. ”ఖడ్గం సినిమాను తీయడం నిజంగా ఒక సాహసమే. ఈ రోజుల్లో అయితే ఈ కథను టచ్ చేయలేము. మనోభావాలు దెబ్బతిన్నా యనడం, మీడియా దానిని మరింత ఎక్కువ చేసి చూపించడం . ఇంకా అల్లరి చేయడం జరిగేవి. ‘ఖడ్గం’ గొప్ప సినిమా అని చెప్పలేంగానీ .. ఒక మంచి సినిమా అని మాత్రం చెప్పగలను. కథను మంచి ఎంజాయ్ చేస్తూ షూటింగు చేశాము. ఇది ఒక హీరో . ఒక విలన్ సినిమా కాదు. తప్పకుండా సక్సెస్ ను సాధిస్తుంది అనే నమ్మకాన్ని కలిగించే ఫార్ములా కాదు. అప్పట్లో ఆ బడ్జెట్ లో ఈ సినిమాను తీయడం నిజంగా రిస్క్ అనే చెప్పాలి. స్వార్థం పెరిగిపోతున్న రోజుల్లో . మనలను మోస్తున్న ఈ భూమికోసం . మరణం తరువాత మనలను తనలో కలిపేసుకుంటున్న ఈ నేల కోసం మనమేం చేయాలనే ఒక దేశభక్తి నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించాము. అందుకు తగిన ప్రతిఫలం లభించినందుకు ఆనందంగా అనిపించింది” అని చెప్పారు. 2002 నవంబర్ 29న విడుదలైంది. రవితేజ, సంగీత, శ్రీకాంత్, సోనాలి బింద్రే , ప్రకాశ్ రాజ్ ప్రధానమైన పాత్రలను పోషించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos