హామిల్టన్ : బాంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో శనివారం న్యూజిలాండ్ ఆరు వికెట్ల నష్టానికి 715 పరుగులు చేసి, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. టెస్టు క్రికెట్లో ఆ జట్టుది ఇదే అత్యధిక స్కోరు. జీతన్ రావల్ (132), టామ్ లాథమ్ (161)లు సెంచరీలు చేయగా, కెప్టెన్ విలియమ్సన్ డబుల్ సెంచరీ చేసి నాటౌట్గా నిలిచాడు. తర్వాత రెండో ఇన్నింగ్స్ కు దిగిన బాంగ్లా నాలుగు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 234 పరుగులకు ఆలౌటైన ఆ జట్టు, మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండగా, 307 పరుగులు వెనుకబడి ఉంది.