డయాలసిస్ చేయించుకునే రోగులు పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే ప్రాణాపాయం ముప్పు తక్కువగా ఉంటుందని తాజా సర్వే పేర్కొంది. అయితే కిడ్నీ రోగులు ఎలాంటి ఆహారం తీసుకోవాలనే విషయంలో మరిన్ని పరిశోధనలు జరగాలని యూనివర్సిటీ ఆఫ్ బరీ (ఇటలీ), యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ పరిశోధకులు అభిప్రాయపడ్డారు. పొటాషియం పెరుగుతుందే కారణంతో డయాలసిస్ చేయించుకునే వారిని పండ్లు, కూరగాయలు తినొద్దని చెబుతుంటారు. కానీ అది పొరపాటని తమ పరిశీలనలో గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు.