రైతు మృతులకు ప్రియాంక నివాళి

రైతు మృతులకు ప్రియాంక నివాళి

లఖ్నవూ : లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘనటలో మరణించిన రైతులకు కాంగ్రె స్ పార్టీ నేత ప్రియాంక గాంధీ నివాళు లర్పించారు. లఖింపూర్ ఖేరిలో మంగళవారం జరిగిన ‘అంతిమ ప్రార్థన’లకు హాజరయ్యారు. రాష్ట్రీయ లోక్ దళ్ చీఫ్ జయంత్ చౌదరి, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు చెందిన వేలాది మంది రైతులు పాల్గొన్నారు. పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తారు. లఖింపూర్ ఖేరి ఘటనపై వాస్తవాలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతల ప్రతినిధి బృందం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను బుధవారం కలుసుకోనుంది. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ, రాజ్యసభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్జే, సీనియర్ నేతలు ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్, లోక్సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ , కేసీ వేణుగోపాల్ ఆ బృందంలో ఉండనున్నారు. రైతులపై కారును నడపి వారి మృతికి కారణమైన లఖింపూర్ ఖేరి కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos