తెలుగు ప్రజలను అవమానిస్తే సహించేది లేదు..

  • In Film
  • June 20, 2019
  • 104 Views
తెలుగు ప్రజలను అవమానిస్తే సహించేది లేదు..

తమిళ చిత్ర పరిశ్రమలోని నడిగర్‌ సంఘానికి జరుగుతున్న ఎన్నికలు శాసనసభ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోవడం లేదు.అధికార,ప్రతిపక్షాల నేతలకు ఏమాత్రం తీసిపోని రీతిలో బరిలో నిల్చున్న రెండు ప్యానెళ్ల సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శలు,ఆరోపణలు చేసుకుంటున్నారు.ఈ క్రమంలో దర్శకుడు భారతీరాజ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు,నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.నడిగర్‌ సంఘానికి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మరోసారి ఎన్నికల బరిలో నిల్చున్న హీరో విశాల్‌ను ఉద్దేశిస్తూ భారతీరాజ చేసిన వ్యాఖ్యలపై కేతిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.నడిగర్ సంఘం ఎన్నికల ను పురస్కరించుకుని నటుడు విశాల్ పై దర్శకుడు భారతీ రాజా చేసిన వాక్యాలు ఒక తెలుగు సంతతికి చెందిన వారిపై తమిళుల దుహంకారానికి నిదర్శనం అని ,తెలుగు వారిని అవమానపరచేలా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలంటూ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి డిమాండ్ చేశారు.ఎన్నికల సందర్భంగా తెలుగు వారిని అవమానించటం పరిపాటి అయ్యిందని,మీ ఎన్నికల వేళ తెలుగు వారిని లాగడం తగదని, గతంలో కూడా భారతీరాజ తెనాలి రామ విడుదల సందర్భంగా ఇదే విధంగా మాట్లాడితే తమిళనాడు లోని తెలుగు సంఘాలు నిరసన వ్యక్తం చేశాయన్నారు.భారతదేశం లో ఎవరైనా,ఎక్కడైనా  నివసించే హుక్కు రాజ్యాంగం కల్పించినప్పటికి..ఇలాంటి వారి మాటల మూలంగా తమిళనాడు లో నివశించుటకు పాస్ పోర్ట్ కావాలని భారతీరాజా కోరనున్నారేమో.. సహోదర భావంతో మేలుగుచున్న ,తమిళ,తెలుగు.ప్రజల మధ్య చిచ్చుపెట్టుటకు ఇలాంటి వారి ప్రయత్నంను రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి పట్టించుకోని వారిపై చర్యలు తీసుకోవాలని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి లు  కె.సి.ఆర్,వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి వెంటనే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి తెలుగు వారికి మేము ఉన్నామని భరోసా కల్పించాలని కేతిరెడ్డి కోరారు..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos