అమరావతి : బ్యాంకు రుణాల ఎగవేత కేసులో తెదేపా లోక్సభ సభ్యుడు కేశినేని నానికి డెట్స్ రికవరీ ట్రిబ్యునల్(డీఆర్టీ) తాఖీదులు జారీ చేసింది. కేశినేని సంస్థల నుంచి వడ్డీతో సహా రుణాల వసూలుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశాఖ శాఖ డీఆర్టీని ఆశ్రయించింది. దీంతో జూలై 11 ఉదయం 10.30లోగా నేరుగా లేదా లాయర్ల ద్వారా వివరణ ఇవ్వాలని డీఆర్టీ ఆదేశించింది. లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కేశినేని నాని, కేశినేని పావని, కేశినేని కార్గో అండ్ కారియర్స్ లిమిటెడ్లకూ పత్రికా ప్రకటన ద్వారా తాఖీదులు జారీ అయ్యాయి.