నాకు జైల్లో ఇంజక్షన్లు ఇవ్వండి.. కోర్టును ఆశ్రయించిన అరవింద్‌ కేజ్రీవాల్‌

నాకు జైల్లో ఇంజక్షన్లు ఇవ్వండి.. కోర్టును ఆశ్రయించిన అరవింద్‌ కేజ్రీవాల్‌

న్యూ ఢిల్లీ : మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తాజాగా కోర్టును ఆశ్రయించారు. జైల్లో తనకు షుగర్ లెవెల్స్ పెరుగుతున్న కారణంగా ఇంజక్షన్లు ఇవ్వాలంటూ రౌస్ అవెన్యూ కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన కేజ్రీ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే, జైల్లో ఆయనకు షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి. దీంతో తనకు ఇంజక్షన్లు ఇవ్వాల్సిందిగా కోర్టును కేజ్రీవాల్ కోరారు. ఈ మేరకు శుక్రవారం పిటిషన్ దాఖలు చేసినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించింది. కేజ్రీ పిటిషన్పై మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనున్నట్లు తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos